Saturday, December 14, 2013

భారత దేశ పురాతన సాంకేతిక విజ్ఞానం


భారత దేశ పురాణాలలో చెప్పిన సాంకేతిక విజ్ఞానం ఇప్పుడు మనకి ఉన్న టెక్నాలజీ కంటే ఎన్నో రెట్లు గొప్పది. కానీ మనలో చాలామందిమి నమ్మం. అదేమిటంటే అవి సైంటిఫిక్ గా నిరూపించబడలేదు అంటారు. అసలు నిజాన్ని మాత్రం మరిచి పోతున్నారు. అదేమిటంటే అవి నిరూపితమైన తరువాతే గ్రంధాలు గా రాసారు.

ఇప్పుడు ప్రపంచ జనాభా ఏడు వందల కోట్లు. అదే వెయ్యేళ్ళు వెనక్కి వెళితే అప్పుడు ఉంది కేవలం ముప్పై కోట్లు మాత్రమే. ఈ వెయ్యేళ్ళలో ఇంతమంది పెరిగారు. కానీ కొన్ని లక్షల సంవత్సరాల నుండి మానవుడు ఉన్నాడు అని ఇంత టెక్నాలజీ కనుక్కున్న శాస్త్రజ్ఞులే చెబుతున్నారు. అంటే మనకి తెలిసింది కేవలం చివరి వెయ్యేళ్ళు మాత్రమే. అది కూడా పూర్తిగా కాదు. ఇప్పుడు ఉన్నది కేవలం ఒక సునామీ వస్తే కొట్టుకు పోయే టెక్నాలజీ మాత్రమే. అప్పట్లో ఏమి టెక్నాలజీ ఉందో తెలీదు. ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు. కొన్ని ఎలా ఏర్పడ్డాయో తెలీదు. కొన్ని కట్టడాలు ఎలా కట్టారో తెలీదు. ఇక్కడ దేవుడు అనే భావన తీసి ప్రక్కన పెడితే ఒకప్పటి మన భారతదేశ సాంకేతిక విజ్ఞానాన్ని అందరూ సందేహిస్తున్నారు. మాయలు, మంత్రాలు అంటే ఏమిటో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ అనే పేరుతో వస్తున్న మాయలు మంత్రాలు గమనించండి.

వెయ్యి సంవత్సరాల క్రితం వెయ్యి కిలోమీటర్లు వెళ్ళటానికి ఎంత సమయం పడుతూ ఉండేది. కనీసం ఇరవై నుండి యాభై రోజులు. కానీ ఇప్పుడు ఇరవై నుండి యాభై నిముషాలు అంతే. ఇంకో వెయ్యి సంవత్సరాల తర్వాత ఇరవై నుండి యాభై సెకండ్లు పట్టవచ్చు. ఇంటర్నెట్, వైర్ లెస్ టెక్నాలజీ తో మనం కావాల్సిన వాళ్ళతో మాట్లాడుకుంటున్నాం. చూసుకుంటూ మాట్లాడుకుంటున్నాం. ఇన్విసిబిల్ టెక్నాలజీ కూడా వచ్చింది. ఒక కోట్ వేసుకుంటే మనల్ని కనపడనీయకుండా చేసేటట్లు. మనం మాటలతో పనులు జరిగేటట్లుగా మనకి ఫోన్లు, కంప్యూటర్ లు, రోబోట్ లు ఉన్నాయి. ఎక్కడ ఏ దేశంలో ఏమి జరుగుతున్నా చూపించటానికి శాటిలైట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమి చేస్తున్నారో చూపించటానికి కెమెరాలు ఉన్నాయి.
ఇవే కదా మనం అనుకునే మాయలు మంత్రాలు. మాట్లాడితే ఏదో ప్రత్యక్షమవటం, ఏది కావాలంటే అది మంత్రాలతో సృష్టించటం, ఎవరితో కావాలంటే వాళ్ళతో మాట్లాడటం.... ఇలా మనం అనుకునే మాయలు మంత్రాలకి మనం దగ్గర అవుతున్నాం. అలా దగ్గరవుతూ కూడా మన పురాణాలలో చెప్పిన దాన్ని మనం నమ్మం.

లోపం ఎక్కడ ఉందో తెలుసా? మనలో కాదు. మనకి ఇప్పుడున్న టెక్నాలజీ లో. నిజం గా నిజం. బారతదేశ పురాతణ సాంకేతిక విజ్ఞానాన్ని పరీక్షించ గలిగే శక్తి ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న టెక్నాలజీ కి లేదు. గ్రహాలు, వాటి మధ్య దూరాలు మన పురాణాల్లో కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం చెప్తే, ఇప్పుడు నాసా వాళ్ళు అది నిజమే అని చెబుతున్నారు. మనకున్న శక్తిని ఎవరో చెప్తే కానీ నమ్మలేని దౌర్భాగ్యం మనది. పుట్టుక దగ్గరనుండి చనిపోయే వరకే కాకుండా చనిపోయిన తర్వాత ఏమీ జరుగుతుంది అనేది కేవలం మన పురాణాలలో మాత్రమే ఉంది. ఎక్కడ ఏమి జరుగుతుంది అనే ప్రతి ప్రశ్నకీ సమాధానం మన పురాణాలలో దొరుకుతుంది. మరి మనం ఎప్పుడు నమ్ముదాం....

కానీ మనకున్న అంత సాంకేతిక విజ్ఞానం ఎలా కనుమరుగు అయ్యింది? ఇదే అందరూ అడిగే ప్రశ్న. కొన్ని కొన్నింటికి ఊహలు ఉండాలి తప్పదు. అలాంటిందే ఈ క్రింది నా ఊహ. మనకి ఉన్న సాంకేతిక విజ్ఞానం కనుమరుగు అయిపోవటానికి కారణాలు ఈ క్రిందివి అయి ఉండవచ్చు
1) ప్రకృతి వైపరీత్యాలు
2) రాజ్య వ్యవస్థ
3) యుద్దాలు
4) కొందరి స్వార్ధం
5) వలసలు

నా దృష్టిలో భూమి అత్యంత ప్రమాదకరమైన నివసించటానికి వీలు కలిగిన ఒక గ్రహం. ఎందుకంటే మూడు వంతులు నీరే ఉంది. ఒక పెద్ద ప్రకృతి వైపరీత్యం చాలు ఉన్నవాళ్ళందరూ తుడిచిపెట్టుకు పోవటానికి. అలా జరిగి అప్పట్లో మనకి ఉన్న టెక్నాలజీ మొత్తం నాశనం అయ్యి ఉండవచ్చు.

మన రాజుల వ్యవస్థలో ఒకరి మీదకి ఒకరు దండయాత్ర చెయ్యటం అనేది చాలా మాములుగా జరిగే విషయం. అటువంటి పరిస్థితుల్లో శత్రువుల కి దొరకకుండా ఉండేందుకు అప్పటి వరకు ఆ రాజ్యం లో కనిపెట్టిన టెక్నాలజీ ని మొత్తం నాశనం చెయ్యటం చాలా సాధారణం గా జరిగే విషయం.

యుద్దాలు వల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగి కూడా టెక్నాలజీ నాశనం అయ్యి ఉండవచ్చు
పూర్వ కాలం టెక్నాలజీ ఒకడి సొత్తు గా మాత్రమే ఉండేది. ఉదాహరణకి వైద్యుడు కేవలం వాడి వారసులకు మాత్రమే వైద్యం నేర్పే వాడు. కనిపెట్టిన టెక్నాలజీ ని ఇంకొకరితో పంచుకోకపోవటం వల్ల అంతం అయ్యి ఉండవచ్చు. మన ఆయుర్వేదం కూడా అలాగే మరుగున పడిపోయింది. ఇంకో మతం వారు పరిపాలించటం వల్ల కూడా ఆయుర్వేదం మరుగున పడిపోయింది.


చివరిగా నేను అనుకునేది వలసలు. ఇంతకంటే ఆవాసయోగ్యమైన గ్రహం ఇంకొకటి కనిపించి ఉండవచ్చు. భూమికి ఏదో ప్రమాదం జరగవచ్చని ముందుగానే తెలుసుకుని అక్కడకి వెళ్లి పోయి ఉండవచ్చు. కేవలం కొంతమంది మూర్ఖులు మాత్రమే ఇక్కడ ఉండి తరువాత రోజుల్లో మానవ అభివృద్ధి జరిగి ఉండవచ్చు. మళ్ళి మొదటినుండి అన్ని కనిపెట్టాల్సి వచ్చింది.