Sunday, October 28, 2012

దేవుడు ఎవరు?


ఈ ప్రశ్న నాది కాదు. అందరిది. నిజం గా దేవుడు ఉంటే మరి మనిషికే ఎందుకు పరిమితమయ్యాడు. జంతువులకి దేవుడు ఉండడా? దేవుడుని చూసిన వాళ్లెవరు లేరా? ఉంటే వాళ్లెవరు దేవుడిని ఇంకొకరికి చూపించలేరా?

ఒక మనిషి లేకుండా ఇంకొకరు పుట్టరు. ఇది అందరికి తెలిసిన నిజం. మనకు తెలిసిన దేవుళ్ళలో ముఖ్యులు త్రిమూర్తులు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. మన పురాణాలు చూస్తే వీరి చిన్నతనం గురించి కానీ ఇప్పుడు ఎలా ఉన్నారన్నది కానీ ఎవరికీ తెలీదు. ఎందుకు తెలుసుకోలేక పోయారు. తెలుసుకున్నంత వరకైనా ఎలా తెలుసుకోగలిగారు. శివుడి భార్యలు పార్వతి మరియు గంగ. కొడుకులు కుమార స్వామి, వినాయకుడు. మరి మనవళ్ళు? ఎవరూ లేరా? ఉండీ తెలియలేదా?

విష్ణువుకి, బ్రహ్మకి కొడుకులు లేరా? వారు దేవుళ్ళు కారా? ఇలా ఆలోచించుకుంటే మనకి ఇంతమంది దేవుళ్ళు ఎలా వచ్చారో అర్ధం అవుతుంది.

నా దృష్టిలో ఈ సృష్టి కాల క్రమేనా ఏర్పడింది. దేవుళ్ళు కూడా అంతే. కాకుంటే దైవత్వం కొందరికే వచ్చింది. ఎలాగంటారా మన మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు అందరికి తెలుసు. కానీ అతని కొడుకు ఎంతమందికి తెలుసు. చాలా కొద్ది మందికి. ఒక వంద సంవత్సరాల తర్వాత అతను ఎంతమందికి తెలిసి ఉంటాడు. అంతా మర్చిపోయి ఉండవచ్చు. ఇప్పుడంటే అంతా డాక్యుమెంట్ చేసి ఉంచుతున్నాం కాబట్టి మళ్ళి కనుక్కోవచ్చు. అంతే ఎవరైతే గొప్ప దైవత్వం కలవారో వాళ్ళే గుర్తుండిపోయారు.

తరాలు మారినప్పుడు పురాణాలూ మారాయి. ఒకప్పుడు క్రీస్తు, అల్లా లేరు. కానీ ఇప్పుడు వాళ్ళు దేవుళ్ళు. అలానే రెండు వందల సంవత్సరాల క్రితం సాయిబాబా లేడు. కానీ ఇప్పుడు ....

ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా మంది దేవుళ్ళు లేరు. ఎవరికైనా ఉంది మహిమలు మాత్రమే. ఆ మహిమలు కొందరికి ఎక్కువ మరికొందరికి తక్కువ. ఇప్పుడు ఈ క్షణం నా దగ్గర కూడా కొన్ని మహిమలు ఉంటే నన్ను కూడా దేవుడిగా చూస్తారు. నేను కూడా వర్షాన్ని కురిపించగలిగితే, క్షణాల్లో రోగాన్ని తగ్గించగలిగితే కనీసం దేవుని ప్రతినిధిగా చూస్తారు. ఇది సహజం. దైవత్వం కలిగిన ప్రతి ఒక్కరూ దేవుడే. వైద్యం లాగా దైవత్వం కూడా ఒక కళ. అది ప్రకృతి దగ్గర నేర్చుకోవాలి. ముందు మానవ శరీరం గురించి తెలుసు కోవాలి. శరీరం లోని ప్రతి అణువు పనిని నియంత్రించడం నేర్చుకోవాలి. తరువాత ప్రకృతి ని నియంత్రించడం నేర్చుకోవాలి. ఇవన్ని నేర్చుకున్నవాడి అధీనంలో ప్రపంచం ఉంటుంది. వారికి చావు ఉండదు. ఇవన్ని నేర్చుకోవటానికి ఎంతో మంది మన సమాజానికి దూరం గా వెళ్లి తపస్సు చేస్తున్నారు. కొంతమంది అలా నేర్చుకుని ప్రకృతిలో కలిసి పోతే ఇంకొంతమంది 
నేర్చుకోలేక బయటకి వచ్చి బాబాలుగా స్థిరపడి పోయారు.

మనిషి గురించి మొత్తం తెలుసుకున్నపుడే మనిషి దేవుడు అవుతాడు.